CRIMENATIONAL

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం-11 మంది మృతి

అమరావతి: మధ్యప్రదేశ్ లో శుక్రవారం వేకువ జామున 2 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది ఘటన స్థలంలోనే మరణించారు.బేతుల్‌ జిల్లాలోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సు, టవేరా ఢీకొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయం చర్యల్ని చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మృతుల్లో 6 పురుషులు, 3 మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు టవేరా కారులో ఉన్న వారంతా మహారాష్ట్రలోని అమరావతి నుంచి తమ ఇంటికి వెళ్తున్నారు .టవేరా డ్రైవర్‌కు మార్గమధ్యలో నిద్రరావడంతో ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టిందని బేతుల్‌ ఎస్పీ సిమ్లా ప్రసాద్‌ తెలిపారు.

ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు .మృతుల కుటుంబాలను తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడినవారికి రూ.50,000 ఆర్థిక సహాయం ప్రకటించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *