3,400 కోట్లతో కేదార్నాథ్ వద్ద రెండు రోప్వే ప్రాజెక్టులు-ప్రధాని మోదీ

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ ప్రాంతంలో రెండు రోజుల పాటు ప్రధాని పర్యాటన కొనసాగుతుంది. ప్రధాని మోడీ రాకతో కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సుమారు రెండు క్వింటాళ్ల పూలతో సుందరంగా అలంకరించారు. ఆలయం సందర్శన నేపథ్యంలో ప్రధాని మోడీ, హిమాచల్ ప్రదేశ్లోని చంబా మహిళలు తయారు చేసిన దుస్తులను ధరించారు..గౌరీ కుండ్ నుంచి కేదార్నాథ్, గోవింద్ఘట్ నుంచి హేమకుండ్ సాహిబ్లను కలుపుతూ రెండు కొత్త రోప్వే ప్రాజెక్టును అందుబాటులోకి రానున్నాయి.3,400 కోట్లతో కేంద్ర ప్రభుత్వం కొత్త రోప్వే ప్రాజెక్టులను చేపడుతున్న నేపధ్యంలో ఇక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మోడీ పరిశీలించారు.అలాగే ఆదిగురువు శంకరాచార్యుల సమాధి స్థలాన్ని సందర్శించారు.కేదార్నాథ్లోని మందకి అస్తపథం, సరస్వతీ అస్తి పథాలను పరిశీలించారు.అనంతరం స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గౌరీకుండు నుంచి కేదార్నాథ్ 9.7 కిలోమీటర్ల రోప్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.