అమరావతి: చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా భారతీయులు జరుపుకునే దీపావళి పండుగకు అగ్రరాజ్యం అమెరికాలో ఫెడరల్ హాలిడే ప్రకటించాలని కోరుతూ యూఎస్ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ ఓ బిల్లును ప్రతిపాదించింది..‘దిపావళీ డే యాక్ట్’ పేరుతో రూపొందించిన ఈ బిల్లును డెమొక్రాటిక్ పార్టీకి చెందిన సభ్యురాలు గ్రేస్ మెంగ్ శుక్రవారం చట్టసభలో ప్రవేశపెట్టారు..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివాళీ డే యాక్ట్ ను సభలో ప్రవేశపెడుతున్నందుకు గర్వంగా, సంతోషంగా ఉందన్నారు..దీపావళి పండగ రోజును ఫెడరల్ హాలిడేగా ప్రకటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు..ఈ బిల్లు మొదట పార్లమెంట్లో పాస్ కావాల్సి ఉంటుంది..అనంతరం అధ్యక్షుడు సంతకంతో చట్టం అవుతుంది..ఈ బిల్లుపై చట్టసభ్యులు, అమెరికాలోని భారతీయ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది..ఈ బిల్లును స్వాగతిస్తున్నట్లు న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్కుమార్ ప్రకటించారు.. ఈ సంవత్సరం దీపావళి పండగను ఫెడరల్ హాలిడేగా జరుపుకొందామన్నారు.. అమెరికాలో స్థిరపడిన దక్షిణాసియా దేశస్థులు అనుసరించే సంస్కతి, సంప్రదాయాలను గౌరవించుకున్నట్టవుతుందని వ్యాఖ్యానించారు..ఈ బిల్లు చట్టసభలో ఆమోదం పొందితే అమెరికా ఫెడరల్ హాలిడేస్లో 12వ హలిడేగా నిలుస్తుంది..అమెరికాలో ప్రస్తుతం 11 ఫెడరల్ హాలీడేస్ మాత్రమే ఉన్నాయి..న్యూ ఇయర్, మార్టిన్ లూథర్ కింగ్ జయంతోత్సవాలు, ప్రెసిడెంట్స్ డే, మెమొరియల్ డే, జునెటెంత్ డే, ఇండిపెండెన్స్ డే, లేబర్ డే, కొలంబస్ డే, వెటరన్స్ డే, థాంక్స్ గివింగ్ డే, క్రిస్మస్ డే సందర్భంగా అమెరికా వ్యాప్తంగా అధికారికంగా సెలవు ఉంటుంది..ఇపుడు దీపావళికి ఫెడరల్ హాలీడేగా ప్రకటిస్తే 12వ ఫెడరల్ హాలీడేగా నిలవనుంది.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.