HYDERABAD

సీ.ఎం హిమంత బిశ్వ శర్మ చేతిలో మైక్ లాక్కున్న టీఆర్ఎస్ నాయకులపై హత్యయత్నం కేసు పెట్టాలి-బండి

హైదరాబాద్: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను మాట్లాడనీయకుండా టీఆర్ఎస్ నేతలు మైక్ లాక్కోవడం హేయమైన చర్య అని,, హిందువుల సంఘటిత శక్తిని చాటుతూ భారత దేశంలోనే అత్యద్భుతమైన శోభాయాత్రగా సాగే గణేష్ నిమజ్జన ఉత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన అసోం సీఎంను గౌరవించాలనే కనీస మర్యాద లేకుండా టీఆర్ఎస్ నేతలు నీచంగా వ్యవహరించడం సిగ్గు చేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిప్పులు చేరిగారు…శుక్రవారం గణేష్ నిమజ్జన శోభా యాత్రలో కేసీఆర్ కానీ, ఆయన కుటుంబ సభ్యులుకానీ ఎక్కడా పాల్గొనలేదని,,లక్షలాది మంది పాల్గొనే శోభాయాత్రలో పాల్గొనేందుకు అసోం నుండి వచ్చిన ముఖ్య అతిథిని అడ్డుకుంటే పరువు పోతుందనే కనీస ఆలోచన లేకపోవడం సిగ్గు చేటన్నారు..మెడలో టీఆర్ఎస్ కండువా వేసుకుని టీఆర్ఎస్ నాయకులను ప్రోటోకాల్ లేకుండా పోలీసులు స్టేజీపైకి ఎట్టా రానిచ్చారు? రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చే భద్రత ఇదేనా? అంటూ ప్రభుత్వంను నిలదీశారు.ఇతర రాష్ట్రాల పర్యటనలకు వెళుతున్న సీఎం కేసీఆర్ కు కేంద్రం భద్రత కల్పించకపోతే స్వేచ్ఛగా వెళ్లగలిగేవారా? బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రశాంతంగా తిరగగలరా?  అంటూ ప్రశ్నించారు.భారత దేశంలోనే అతి తక్కువ కాలంలో అద్భుతమైన పాలనతో  అసోంను అభివృద్ధి చేసి చూపిస్తున్న గొప్ప వ్యక్తి హేమంత బిశ్వ శర్మ అని,,అవినీతి రహిత పాలనతో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఆయన నుంచి నేర్చుకోవాల్సింది పోయి టీఆర్ఎస్ గూండాలను పంపించి దాడి చేయించే కుట్ర చేయడం కేసీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనం అంటూ మండిపడ్డారు. సీఎంపై దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ నేతపై తక్షణమే అరెస్ట్ చేసి హత్యా యత్నం కేసు పెట్టాలని,,ఈ దాడికి పురిగొల్పిన రాష్ట్ర మంత్రులపైనా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు..

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *