అమరావతి: ప్రజలను మోసం చేసిన మొబైల్ గేమింగ్ యాప్ ప్రమోటర్లపై మనీలాండరింగ్ విచారణలో భాగంగా కోల్కతాలోని ఆ యాప్ ప్రమోటర్కు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో దాడులు నిర్వహించి రూ.7 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ శనివారం తెలిపింది..ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి..ఈ-నగ్గెట్స్ యాప్ ప్రారంభించిన కొత్తలో యూజర్లకు కమీషన్లు ఇచ్చారు..వ్యాలెట్లోని బ్యాలెన్స్ను ఈజీగా విత్డ్రా చేసుకునే వీలు కల్పించడంతో,,యూజర్లలో యాప్పై నమ్మకం పెరిగింది..ఎక్కువ కమీషన్కు ఆశపడి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టారు..ఇలా భారీ మొత్తంలో నిధులు సమీకరించిన తరువాత యాప్ నుంచి యూజర్లు కమీషన్ విత్డ్రా చేసుకునే ప్రక్రియను ఈ-నగ్గెట్స్ యాజమాన్యం నిలిపివేసింది.. సిస్టమ్ అప్డేట్ చేస్తున్నామని, దర్యాప్తు సంస్థలు విచారణను ఎదుర్కొంటున్నామని కుంటు సాకులు విన్పిస్తూ, చివరకు యూజర్ల డేటా సహా సర్వర్లలోని సమాచారం మొత్తాన్ని డిలీట్ చేసింది..దింతో ఈ యాప్ చేసిన ఘరాన మోసం యూజర్లకు అర్థం కావడంతో,ఈ-నగ్గెట్స్ యాప్ సహా ఆ కంపెనీ ప్రమోటర్పై 2021 ఫిబ్రవరిలో కోల్కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు.