శ్రీవారికి రూ.1.02 కోట్లు విరాళంగా అందించిన ముస్లిం భక్తుడు

తిరుమల: చెన్నైకి చెందిన సుబీనాబాను, అబ్దుల్ ఘనీ దంపతులు మంగళవారం టీటీడీకి రూ.1.02 కోట్లు విరాళంగా అందించారు..శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో దాతలు విరాళం చెక్కును ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందించారు..ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.15 లక్షలు, ఇటీవల తిరుమలలో ఆధునీకరించిన శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో నూతన ఫర్నిచర్, వంటశాలలో పాత్రలకు రూ.87 లక్షలు విరాళంగా అందజేశారు.