AMARAVATHIINTERNATIONAL

గ్రీస్ లో ఘోర రైలు ప్రమాదం, 29మంది మృతి,85 మందికి తీవ్ర గాయాలు

అమరావతి: గ్రీస్ లో గూడ్స్ రైలును ఓ ప్యాసింజర్ రైలు ఢీకొన్న దుర్ఘటనలో దాదాపు 29మంది ప్రాణాలు కోల్పోగా,, మరో 85 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు..బుధవారం వేకువజామున  ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. ప్రమాద తీవ్రను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని గ్రీస్ అగ్నిమాపక  అధికారి వాసిలిస్ వర్తకోయనిస్ తెలిపారు. మూడు బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయని,,పట్టాలు తప్పిన బోగీలు సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లినట్లు వెల్లడించారు..ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందండంతో,తన సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని,సహాయ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.. ఏథెన్స్ కు ఉత్తరన 235 మైళ్ల దూరంలో ఉన్న టెంపే అనే చిన్న పట్టణానికి సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.. ప్రమాదం జరిగిన సమయంలో రైల్లో దాదాపు 350 మంది ప్రయాణీకులు ఉన్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపటానికి చాలామంది ప్రయాణీకులు కిటికీల్లోంచి బయటకు దూకడంతో,, చాలామందికి గాయాలు అయినట్లు అధికారులు వెల్లడించారు..గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు..సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అగ్నిమాపక   అధికారులు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *