x
Close
INTERNATIONAL

సముద్రంలో మునిగిపోయిన యుద్ద నౌక-33 మంది నావికులు గల్లంతు

సముద్రంలో మునిగిపోయిన యుద్ద నౌక-33 మంది నావికులు గల్లంతు
  • PublishedDecember 19, 2022

అమరావతి: గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో యుద్ద నౌక సముద్రంలో మునిగిపోయిన సంఘటనలో 33 మంది నావికులు గల్లంతు అయ్యారు..తప్పిపోయిన మెరైన్ లను గుర్తించడానికి థాయ్‌లాండ్ సైన్యం 3 యుద్ధనౌకలు,,2 హెలికాప్టర్‌లను రంగంలోకి దింపినట్లు నావికాదళం సోషల మీడియా ద్వారా వెల్లడించింది.. HTMS సుఖోథాయ్ యుద్ధ నౌక ఇంజిన్ పనిచేయకపోవటంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది..తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగానే రాత్రి సమయంలో బ్యాంకాక్‌కు దక్షిణంగా ఉన్న ప్రచుప్ ఖిరి ఖాన్ ప్రావిన్స్‌ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు పేర్కొన్నారు.. వాతావరణం అనుకూలించకపోవడంతో నౌకలో ఉన్న 106మందిలో 73 మంది లైఫ్ జాకెట్ల ద్వారా సురక్షితంగా ఉండగా,,33 మంది తప్పిపోయారు. నౌకాదళం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది..1987 నుండి వాడుకలో ఉన్న యుఎస్-నిర్మిత కొర్వెట్ అయిన సుఖోథాయ్ ఆదివారం బలమైన అలల తాకిడికి గురైంది..సముద్రంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అది ఒక వైపుకు వంగిపోయిందని ప్రమాదం జరిగిందని నావికాదళ ప్రతినిధి అడ్మిరల్ పోగ్‌క్రాంగ్ మాంథార్డ్‌పలిన్ తెలిపారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.