INTERNATIONAL

సముద్రంలో మునిగిపోయిన యుద్ద నౌక-33 మంది నావికులు గల్లంతు

అమరావతి: గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో యుద్ద నౌక సముద్రంలో మునిగిపోయిన సంఘటనలో 33 మంది నావికులు గల్లంతు అయ్యారు..తప్పిపోయిన మెరైన్ లను గుర్తించడానికి థాయ్‌లాండ్ సైన్యం 3 యుద్ధనౌకలు,,2 హెలికాప్టర్‌లను రంగంలోకి దింపినట్లు నావికాదళం సోషల మీడియా ద్వారా వెల్లడించింది.. HTMS సుఖోథాయ్ యుద్ధ నౌక ఇంజిన్ పనిచేయకపోవటంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది..తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగానే రాత్రి సమయంలో బ్యాంకాక్‌కు దక్షిణంగా ఉన్న ప్రచుప్ ఖిరి ఖాన్ ప్రావిన్స్‌ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు పేర్కొన్నారు.. వాతావరణం అనుకూలించకపోవడంతో నౌకలో ఉన్న 106మందిలో 73 మంది లైఫ్ జాకెట్ల ద్వారా సురక్షితంగా ఉండగా,,33 మంది తప్పిపోయారు. నౌకాదళం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది..1987 నుండి వాడుకలో ఉన్న యుఎస్-నిర్మిత కొర్వెట్ అయిన సుఖోథాయ్ ఆదివారం బలమైన అలల తాకిడికి గురైంది..సముద్రంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అది ఒక వైపుకు వంగిపోయిందని ప్రమాదం జరిగిందని నావికాదళ ప్రతినిధి అడ్మిరల్ పోగ్‌క్రాంగ్ మాంథార్డ్‌పలిన్ తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *