CRIME

దుత్తలూరు తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు

పట్టుబడిన వీఆర్వో..

నెల్లూరు: పొలం మ్యూటేషన్ కొరకు రైతు వద్ద 10,000 నగదు తీసుకుంటూ బుధవారం దుత్తలూరు మండలం సోమల రేగడ వీఆర్వో హజరత్ మస్తాన్ ఏసిబి అధికారులకు అడ్డంగా దొరికిపోయారు..రైతు అయిన రాధాకృష్ణ గత సంవత్సరం 1.30 ఏకరం భూమిని అదే గ్రామానికి చెందిన రైతు వద్ద నుంచి కొనుగొలు చేశాడు.పట్టాదారు పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్న రాధాకృష్ణకు VRO మస్తాన్ పలు కొర్రీలు చూపిస్తు,,లంచం కొసం ఆఫీసు చుట్టు తిప్పుకోవడం మొదలు పెట్టాడు..VRO మస్తాన్ ను ఆఫీసు బయట కలుసుకున్న రాధాకృష్ణ ఆసలు విషయం ఏమిటో చెప్పాలను కోరారు..ఇందుకు పెద్ద మొత్తంను తొలుత డిమాండ్ చేసిన మస్తాన్,, చివరికి రూ.10 లంచం ఇవ్వాలను కోరారు..కడుపు మండిన రాధాకృష్టి ఏసిబి అధికారులకు సమాచారం అందించారు.. బుధవారం నగదు తీసుకుంటున్న మస్తాన్ ను, నెల్లూరు ACB DSP GRR మోహన్,, CIలు కిరణ్,వేణు ఆద్వర్యంలో దాడులు జరిపి రెడ్ హ్యండ్ గా పట్టుకున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *