x
Close
DEVOTIONAL

డిసెంబరు 22 నుంచి జనవరి 15వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

డిసెంబరు 22 నుంచి జనవరి 15వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు
  • PublishedDecember 15, 2022

తిరుమలి: శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 22 నుంచి 2023 జనవరి 15వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ అధ్యయనంగా పిలిచే ఈ అధ్యయనోత్సవం ప్రారంభమౌతుంది.ఈ సందర్భంగా శ్రీవైష్ణవ జీయంగార్లు స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్ఠిగానం చేస్తారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు. తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు.22వ రోజున కణ్ణినున్‌ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి సాత్తుమొర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *