INTERNATIONAL

అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీ హతం-అమెరికా అధ్యక్షడు జో బైడెన్

అమరావతి: అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీని కాబుల్ లో అదివారం అమెరికా బలగాలు డ్రోన్ల సాయంతో అంతమొందించాయి..ఈ దాడిపై తాలిబన్లు స్పందిస్తూ,,అమెరికా చర్య అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని, జవహరిపై దాడిని ఖండిస్తున్నామన్నారు..2020లో జరిగిన అమెరికా బలగాల ఉపసంహరణ ఒప్పందాన్ని అతిక్రమించారంటూ ఈ మేరకు తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహీద్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.. కాబూల్‌లోని ఓ నివాసంలో తలదాచుకున్న అల్ జవహరిని మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం వెల్లడించారు..9/11 దాడి బాధితులకు న్యాయం చేసినట్లయిందని పేర్కొన్నారు..ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన అమెరికా నిఘా వర్గాలను కొనియాడారు..అల్ జవహరి  కుటుంబంతో సహా కాబూల్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్నాడనే పక్కా సమాచారంతో,,అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది.. అతను ఇంటి బాల్కనీపైకి వచ్చినప్పుడు,,నిర్దారించుకుని డ్రోన్ల సాయంతో క్షిపణులతో విరచుకుపడింది..ఈ ఘటనలో సాధారణ పౌరులెవరూ మరణించలేదని అమెరికా నిఘా వర్గాలు పేర్కొన్నాయి..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *