INTERNATIONALMOVIE

న్యూయార్క్ లో కూడా తగ్గేదే లే అంటున్న అల్లు ఆర్జున్

హైదరాబాద్: పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‏కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని భారతీయ ప్రవాసులు న్యూయార్క్ నిర్వహించిన ప్రపంచంలోనే అత్యంత ఇండియా డే పరేడ్‏కు అల్లు అర్జున్ నాయకత్వం వహించారు.తన సతీమణి స్నేహతో కలిసి జాతీయ జెండా చేతపట్టుకుని ఇండియా డే పరేడ్‏లో పాల్గొన్నారు. అనంతరం న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఇండియా డే పరేడ్ లో గ్రాండ్ మార్షల్‏గా సత్కరించారు.ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టా వేదికగా షేర్ చేశారు ఐకాన్ స్టార్.న్యూయార్క్ మేయర్ ను కలవడం చాలా ఆనందంగా ఉంది. అతను చాలా స్పోర్టివ్ జెంటిల్మెన్.మిస్టర్ ఎరిక్ ఆడమ్స్ ధన్యవాదాలు. తగ్గేదే లే అంటూ మేయర్‏తో కలిసి పుష్పరాజ్ సిగ్వేచర్ స్టెప్ వేశారు. వీరిద్దరు కలిసి తగ్గేదే లే అంటున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.ఈ సంవత్సర ఆగస్ట్ 15తో భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంను పురస్కరించుకుని, న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్‏లకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ కలిసి 75 ఏళ్ల భారతదేశ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

https://www.instagram.com/p/ChjBETrMEF5/?utm_source=ig_web_button_share_sheet

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *