అమరావతి: కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది..పార్టీని నడిపేందుకు సరైన నాయకత్వం లేకపోయిన,ఎదొవిధంగా నెట్టుకున్న వస్తున్న కాంగ్రెస్ పార్టీకి సొంత లీడర్స్ షాక్ లపై షాక్ లు ఇస్తున్నారు..ఇటీవల కాలంలో పలువురు కీలక నేతలు ఇప్పటికే బీజేపీ,,ఇతర పార్టీల్లో జాయిన్ అయ్యారు..ఈ నేపథ్యంలో తాజాగా హిమాచల్ ప్రదేశ్ శాఖ స్టీరింగ్ కమిటీ నాయకత్వానికి మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ రాజీనామా చేశారు..ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు..నా ఆత్మగౌరవంతో రాజీపడలేనని అందులో పేర్కొన్నారు..స్టీరింగ్ కమిటీ విధులు,బాధ్యతలపై స్పష్టతనివ్వాలని కోరారు..ఎన్నికల సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా తనను విస్మరించారని పేర్కొన్నట్లు సమాచారం..హిమచల్ ప్రదేశ్ లో మాత్రం పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు..కొద్ది రోజుల క్రితం జమ్మూ, కాశ్మీర్ లో ప్రచార కమిటీ, రాజకీయ వ్యవహారాల ప్యానెల్ ఛైర్మన్ పదవికి G23లో సభ్యుల్లో ఒకరైన గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు..ఈ సంవత్సంర చివరిలో హిమాచల్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి..ఇక్కడ బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది..ఇందులో బాగంగా మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభలో కాంగ్రెస్ ఉప నాయకుడైన ఆనంద్ శర్మను ఏప్రిల్ 26వ తేదీన హిమాచల్ ప్రదేశ్ లో పార్టీ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ గా నియమితులయ్యారు.
Committed to Congress ideology that runs in my blood, let there be no doubts about this! However, given the continuing exclusion and insults, as a self-respecting person- I was left with no choice. 2/2
— Anand Sharma (@AnandSharmaINC) August 21, 2022