AMARAVATHI

ఏ చిన్న ఫిర్యాదు అందిన చాలా జాగ్రత్తగా పరిశీలించాలి-రోల్ అబ్జర్వర్ భాస్కర్

నెల్లూరు: రాజకీయ పక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఈసీ నిబంధనలు పాటించి పరిష్కరించాలని ఫోటో ఓటరు జాబితాల సంక్షిప్త సవరణ-2024 నెల్లూరు జిల్లా రోల్ అబ్జర్వర్ పి.భాస్కర్, అధికారులను ఆదేశించారు..శనివారంవారం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి హరినారాయణన్ తో కలసి , జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఈఆర్వోలు, ఏఈఆర్ ఓ లు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, జిల్లాలో ఓటర్ల జాబితా సంక్షిప్త  సవరణ కార్యక్రమం పై సమీక్షించారు.

తొలుత జిల్లా ఎన్నికల అధికారి హరినారాయణన్, జిల్లాలో చేపడుతున్నఫోటో ఓటరు జాబితాల సంక్షిప్త సవరణ-2024 వివరాలను తెలుపుతూ,  జిల్లాలో 4 రెవెన్యూ డివిజన్లు, 38 మండలాల పరిధిలో తిరుపతి పార్లమెంట్  నియోజకవర్గ పరిధిలో 1 అసెంబ్లీ నియోజక వర్గం, నెల్లూరు పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోక వర్గాలు మొత్తం 8 నియోజక వర్గాలు ఉన్నాయన్నారు. ఓటర్ల జాబితాల సవరణ షెడ్యూల్ ప్రకారం గత నెల 27 నాటికి ముసాయిదా జాబితాలు ప్రకటించడం జరిగిందన్నారు.. జిల్లాలో 2317 పోలింగ్ కేంద్రాలు గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. వాటిలో అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ నెల 2, 3 తేదీల్లో కూడా స్పెషల్  కాంపెయిన్ నిర్వహించి క్లెయిమ్స్&అబ్జెక్షన్స్ అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.

రోల్ అబ్జర్వర్ పి.భాస్కర్ మాట్లాడుతూ,  ఎన్నికల సంవత్సరం కాబట్టి ఫోటో ఓటర్ల జాబితాల సంక్షిప్త సవరణపై ప్రత్యేక దృష్టి సారించాలనన్నారు.,వివిధ రాజకీయ పక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఈసీ నిబంధనలు పాటించి పరిష్కరించాలన్నారు. ఎక్కువగా ఫిర్యాదులు వచ్చిన నియోజకవర్గాలలో వాటి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఏ చిన్న ఫిర్యాదు అందిన చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సరైన విధంగా పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్ల జాబితాలపై సూచనలు తెలియజేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

40 mins ago

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

19 hours ago

ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ప్రచారానికి అనుమతి- కలెక్టర్‌

బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…

19 hours ago

4వ దశలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలతో సీఈసీ

తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…

22 hours ago

అన్ని మాఫియాలకూ పక్కా గుణపాఠం తప్పదు-ప్రధాని మోదీ

అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…

22 hours ago

భారతదేశంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడా

అమరావతి: ఇండియన్ ఓవర్సీస్‌ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్‌గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…

22 hours ago

This website uses cookies.