మార్గదర్శి కేసులో A2 ఎం.డీ శైలాకిరణ్ కు ఏపీ సీఐడీ నోటీసులు
అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు,నిధుల మళ్లింపు కేసులో ఏపీ సీఐడీ,మార్గదర్శి ఎం.డీ చెరుకూరి.శైలాకిరణ్ కు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో A1గా చెరుకూరి.రామోజీరావును,, A2 చెరుకూరి.శైలాకిరణ్ పేర్కొన్న సంగంతి విదితమే..ఈ నేపధ్యంలో విచారణకు అందుబాటులో ఉండాలంటూ సీఐడీ డీఎస్పీ రవికుమార్ అమెకు నోటీసులు జారీ చేశారు..మార్గదర్శి చిట్ ఫండ్ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారించాలని నోటీసుల్లో సీఐడి విభాగం పేర్కొంది..ఈ నెల 29 లేదా 31వ తేదిల్లో మీకు వీలుకాకుంటే ఏప్రిల్ 3 లేదా 6వ తేదిల్లో విచారణకు మీ ఇళ్లు లేదా ఆఫీసుల్లో అందుబాటులో ఉండాలని పేర్కొంది.