x
Close
EDUCATION JOBS NATIONAL

3 వేల మంది జమ్ము కశ్మీర్ యువకులకు అపాయింట్-ప్రధాని మోదీ

3 వేల మంది జమ్ము కశ్మీర్ యువకులకు అపాయింట్-ప్రధాని మోదీ
  • PublishedOctober 30, 2022

అమరావతి: జమ్ము కశ్మీర్ లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేయడానికి 3 వేల మంది యువకులకు అపాయింట్ మెంట్ లెటర్స్ అందచేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధికి కశ్మీర్ యువత ముందుకు రావడం అభినందనీయమని,ప్రజలు ఎప్పుడు పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఉద్యోగాల్లో చేరుతున్న యువకులు కూడా అదే విధంగా ప్రజలకు సేవాలు అందించేందుకు ప్రాధాన్య ఇవ్వాలని సూచించారు.అదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్ రోజ్ గార్ మేళా నిర్వహించారు.ఈ సందర్బంలో ప్రధాని మాట్లాడుతూ గత 8 సంవత్సరాల్లో ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుందని,రాబోయే కొద్ది నెలల్లో 10 లక్షలకు పైగా అపాయింట్‌మెంట్ లెటర్‌లను కేంద్ర ప్రభుత్వం అందజేయనుందని ప్రకటించారు.2019 నుంచి ఇప్పటి వరకు జమ్ము కశ్మీర్ లోలో దాదాపు 30,000 ప్రభుత్వ పోస్టులు భర్తీ చేయబడ్డాయని పేర్కొన్నారు.గత 18 నెలల్లో దాదాపు 20,000 ఉద్యోగాలు యువతకు కల్పించినట్లు చెప్పారు. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పర్యాటక రంగం బలోపేతమవుతోందని,జమ్ము కశ్మీర్ ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని అకాంక్షించారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.