AMARAVATHI

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు కొనసాగగా,, మే నెలలోనూ అంతకు మించి ఎండలు, వడగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలియచేసింది..రెండు రోజుల నుంచి చాలా ప్రాంతాల్లో ఉష్ణోగత్రలు మరింత పెరిగాయని,,మరో 11 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశాలున్నాయని అంచనా వేసింది..2023 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకెక్కింది..భారత వాతావరణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ మృత్యంజయ్‌ మోహపాత్ర మాట్లాడుతూ ఏప్రిల్‌ నెల మొత్తం దాదాపుగా వడగాలులు వీచినట్లు తెలిపారు.. సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదైందని తెలిపారు. ఏప్రిల్‌ నెలలో తూర్పు, ఈశాన్య భారతంలో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 28.12 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని పేర్కొన్నారు.. 1901 తరువాత సదరు ప్రాంతాల్లో ఏప్రిల్‌ నెలలో ఈ స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారన్నారు.. 1980 నుంచి దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడం సాధారణంగా మారాయన్నారు.. దక్షిణ రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, గుజరాత్ ప్రాంతాల్లో మేలో 8-11 రోజుల పాటు వేడి గాలులు ఉండవచ్చని వెల్లడించారు..ఏప్రిల్‌లో ఎండలకు ప్రధాన కారణం ఉరుములతో కూడిన వర్షాలు లేకపోవడమేనని పేర్కొన్నారు..మే నెలలో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు..వాయువ్య,,మధ్య భారతం కొన్ని ప్రాంతాలు,,ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు..

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

14 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

17 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

17 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

19 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

2 days ago

This website uses cookies.