DISTRICTSTECHNOLOGY

నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్దమైన GSLV మార్క్-3

నెల్లూరు: ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన GSLV మార్క్-3 రాకెట్ ద్వారా ఉపగ్రహాలను నింగిలోకి పంపించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి ఆదివారం GSLV–మార్క్‌3 (ఎల్‌వీ-ఎం 3) రాకెట్‌ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు.శనివారం రాత్రి 12 గంటల 12 నిమిషాలకు అంటే ఆదివారం జీఎస్ ఎల్వీ–3 అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కౌంట్ డౌన్ మొదలు కానుంది.5, 200 కిలోల బరువు కలిగిన యూకేకు చెందిన 36 కమర్షియల్ ఉపగ్రహాలను రోదసీలోకి పంపించనున్నారు.NSILతో ఒప్పందం తరువాత నిర్మాణం తరువాత పూర్తి వాణిజ్య అవసరాల కోసం ఈ రాకెట్ ను రూపొందించారు.ఒకేసారి 36 విదేశీ ఉప ప్రగహాలను అంతరిక్షంలోకి పంపించడం ద్వారా ఇస్రో, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కి వ్యాపార పరమైన అవకాశాలు రానున్నాయి.ఈ క్రమంలో 36 ఉపగ్రహాల ప్రయోగానికి one web, NSIL మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది. 4 టన్నుల ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్ కి పంపగలదని, ఇస్రోకు ఒక చారిత్రాత్మక క్షణం అని NSIL ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *