CRIMENATIONAL

మంగళూరులో ఆటోలో పేలుడు-ఉగ్రవాద చర్యే-డీజీపీ

అమరావతి: కర్ణాటక రాష్ట్రం మంగళూరులో శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కంకనాడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆటో రద్దీగా ఉండే రోడ్డులో పేలిపోయిన ఘటన చోటు చేసుకుంది.ఈ సంఘటన ప్రమాదవశాత్తూ జరిగిందికాదని, అది ఉగ్ర చర్య అని పోలీసులు నిర్ధారించారు.ఈ సంఘటనపై కర్ణాటక డీజీపీ ట్విట్టర్ లో వివరాలు తెలిపారు. ‘‘నిన్న చోటు చేసుకున్న పేలుడు ప్రమాదు వశాత్తు జరిగింది కాదు,ఇది ఉగ్ర చర్య,, భారీగా నష్టాన్ని కలిగేంచేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ పేలుడుకు పాల్పడ్డారు. విషయాన్ని మేము ఇప్పుడే నిర్ధారించుకున్నాము. కేంద్ర ఏజెన్సీలతో కలిసి కర్ణాటక పోలీసులు దీనిపై లోతైన విచారణ జరుపుతున్నారు’’ అని డీజీపీ పేర్కొన్నారు.ఈ విషయంపై కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర స్పందిస్తూ,, పోలీసులు జరుపుతున్న విచారణకు కేంద్ర దర్యాప్తు సంస్థలు సహకారం అందిస్తున్నాయని తెలిపారు. పేలుడుకు సంబంధించిన సమాచారాన్నంతా పోలీసులు సేకరిస్తున్నారని, మంగళూరుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు చేరుకున్నట్లు తెలిపారు. పేలుడుపై రెండు రోజుల్లో పూర్తి సమాచారం రాబడతామని అన్నారు. నిన్న జరిగిన పేలుడు మంగళూరు ప్రజల్లో భయాందోళనలు కలిగించింది.ఆటో రిక్షాలో నుంచి పోలీసులు కాలిపోయిన ప్రెజర్ కుక్కర్ ను స్వాధీనం చేసుకున్నారు.అలాగే ఆధార్ కార్డు,సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *