x
Close
NATIONAL POLITICS

కొత్త పార్లమెంటరీ బోర్డు,,కేంద్ర ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజెపీ

కొత్త పార్లమెంటరీ బోర్డు,,కేంద్ర ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజెపీ
  • PublishedAugust 17, 2022

అమరావతి: భారతీయ జనతా పార్టీ 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో వుంచుకుని బుధవారం కొత్త పార్లమెంటరీ బోర్డు,,కేంద్ర ఎన్నికల కమిటీలను ప్రకటించింది..ఇందులో 11 మందితో పార్లమెంటరీ బోర్డు ఏర్పాటు చేయగా,, 15 మంది సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిటీ వివరాలను విడుదల చేసింది..ముగ్గురు కొత్త నేతలకు చోటు కల్పించారు..కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ,,మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు పార్లమెంటరీ బోర్డు నుంచి తొలగించారు..బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జేపీ, నడ్డా బీఎస్‌ యడ్యూరప్ప, సర్బానంద సోనోవాల్‌, కే లక్ష్మణ్‌, ఇక్బాల్‌ లాల్‌పుర, సుధా యాదవ్‌, సత్యనారాయణ జాతియా, బీఎల్‌ సంతోష్‌లను సభ్యులుగా నియమించింది..

అదే విధంగా 15 మంది సభ్యులతో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీని కూడా ప్రకటించారు.. జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీఎస్‌ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, కే లక్ష్మణ్‌, ఇక్బాల్ సింగ్ లాల్‌పుర, సుధా యాదవ్‌, సత్యనారాయణ జటియా,కేఎల్‌ సంతోష్‌, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్‌, ఓమ్ మథుర్‌, వనతి శ్రీనివాస్‌కు చోటు కల్పించారు..

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.