అమరావతి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలన్ని పొడిగిస్తూ బీజెపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది..లోక్ సభ ఎన్నికల వరకు నడ్డా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు..నడ్డా అధ్యక్షతనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి వెళ్తామని స్పష్టం చేశారు..ఈ నెల 20వ తేదిన నడ్డా పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు..పార్టీ నిర్ణయం మేరకు నడ్డా 2024 జూన్ వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
The tenure of JP Nadda as national president of the Bharatiya Janata Party has been extended till June 2024: BJP leader and Union minister Amit Shah pic.twitter.com/lxS7glDL2K
— ANI (@ANI) January 17, 2023