ఈ నెల 20న రామాయపట్నం పోర్ట్ శంకుస్థాపన చేయనున్న సీ.ఎ
నెల్లూరు: రామాయపట్నం పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికల్ వలవెన్, కలెక్టర్ చక్రధర్ బాబుతో కలసి ముందస్తు ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు తగు సూచనలను జారీ చేశారు.ఈ కార్యక్రమంలో J.C కూర్మనాథ్, కందుకూరు R.D.O సుబ్బారెడ్డి, ఇరిగేషన్ S.E కృష్ణమోహన్, DRDA.P.D సాంబశివారెడ్డి, తహశీల్దార్ శ్రీమతి లావణ్య, రామాయపట్నం పోర్ట్ నిర్మాణ సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.