టీటీడీ ధార్మిక కార్యకలాపాలకు సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు నియమకం

తిరుపతి: ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త,, పండితుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక కార్యకలాపాలకు సలహాదారుగా నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో జరిగిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ (HDPP), శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు జరిగాయి.. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సమావేశం ముగిసిన అనంతరం ఈ మేరకు ప్రకటన చేశారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల్లో టీటీడీ నిర్వహించిన ‘పారాయణం’ కార్యక్రమాలు ప్రతి వ్యక్తి చేరాలంటే,,సరైన మార్గదర్శకత్వం అవసరం కాబట్టి, చాగంటి కోటేశ్వరరావు నియామకం అవసరమని తాము భావించినట్లు తెలిపారు..హిందూ ధర్మ ప్రచారాన్ని ప్రతి ఒక్కరి దగ్గరకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మారుమూల గ్రామాల్లో నివసించే గ్రామీణ యువతను ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.