NATIONAL

పిల్లల ఆధార్‌ అప్ డేట్ సేవాలు పూర్తిగా ఉచితం-యుఐడీఏఐ

అమరావతి: పిల్లల ఆధార్‌ అప్ డేట్ చేసేందుకు ఇప్పటి వరకు మీ సేవ కేంద్రాలు,యుఐడీఏఐ సూచించిన ఛార్జీలు కాకుండా, ప్రజల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు.ఈ ఛార్జీల వసూళ్లపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ కీలక ప్రకటన చేసింది.ఆధార్‌ అప్‌డేట్‌ కోసం వచ్చిన వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని భారత ఆధార్‌ సంస్థ(UIDAI) ట్విట్టర్ లో పేర్కొంది. ఈ ఉచిత సర్వీసు కేవలం “బాల్‌ఆధార్‌లో అప్‌డేట్‌ ” చేసుకునేందుకు మాత్రమే వర్తిస్తుంది. ఎవరైనా బాల్‌ఆధార్‌ అప్‌డేట్‌ కోసం డబ్బులు అడిగినట్లయితే ఫిర్యాదు చేయాలని సూచించింది. వినియోగదారులు 1947 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని, లేదా help@uidai.gov.in ఈమెయిల్‌కు ఫిర్యాదు చేయాలని సూచించింది. యూఐడీఏఐ బాల్ ఆధార్/ పిల్లల ఆధార్ కార్డుకు సంబంధించి ఇటీవల కొత్త సూచనలు జారీ చేసింది.5 నుంచి 15 సంవత్సరాలు నిండిన పిల్లలకు,, ఆధార్ రికార్డులలో బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేయడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఇటీవల మార్గదర్శకాలను విడుదల చేసింది.5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లల బయోమెట్రిక్ సమాచారాన్ని అప్‌డేట్ చేయడం తప్పనిసరి అని యూఐడీఏఐ ట్విట్టర్‌లో ప్రకటించింది. బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేసిన తర్వాత పిల్లల ఆధార్ నంబర్లు మారవని యూఐడీఏఐ ప్రకటించింది. ఆధార్‌ కార్డ్‌ను అప్లై చేయడానికి, పిల్లల బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేయడానికి సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాన్ని సందర్శించాలని సూచించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *