NATIONAL

సరిహద్దులో భారీగా డ్రోన్లు, యుద్ధ విమానాలను మోహరిస్తున్న చైనా

అమరావతి: టిబెట్​లోని బాంగ్డా,,లాసా,, షిగాత్సే ప్రాంతాల్లో ఉన్న తన వైమానిక స్థావరాలను అత్యాధునిక డ్రోన్లు, యుద్ధ విమానాలతో నింపుతోంది..ఈ ప్రాంతాలు భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉన్న వైమానిక స్థావరాలు.. అరుణాచల్​ ప్రదేశ్​ లోని తవాంగ్​ సెక్టార్​ వద్ద డిసెంబరు 9వ తేదిన భారత బలగాలతో ఘర్షణ జరిగిన నేపథ్యంలో బార్డర్​ లో, చైనా దూకుడు పెంచింది..ఈ వైమానిక స్థావరాలలో పెద్ద సంఖ్యలో  ‘WZ-7 సోరింగ్​ డ్రాగన్​’  రకం డ్రోన్లు,, ‘సుఖోయ్​ SU 27’ రకం యుద్ధ విమానాలను చైనా మోహరించిందని నిర్ధారించే పలు శాటిలైట్​ దృశ్యాలతో తాజాగా కథనాలను పలు మీడియా సంస్థలు ప్రచురించాయి..ఈ ఉపగ్రహ చిత్రాలు డిసెంబరు 14వ తేది నాటివని పేర్కొన్నాయి..ఇటీవల కాలంలో అరుణాచల్​ ప్రదేశ్​ లోని భారత గగన తలంలో చైనా విమానాలు చక్కర్లు కొడుతూ రెండుసార్లు భారత సైన్యం కంటపడ్డాయి..ఈ సమయంలో టిబెట్​ లోని ఎయిర్​ బేస్​ లలో చైనా ఆయుధ సంపత్తి మోహరించిందనే వార్తలు బయటికి రావడం కలకలం సృష్టిస్తోంది..డ్రోన్లు,,యుద్ధ విమానాలతో నిండుగా ఉన్న టిబెట్​ లోని బాంగ్డా,, షిగాత్సే ఎయిర్​ బేస్​ భారత్​ లోని అరుణాచల్​ ప్రదేశ్​ సరిహద్దుకు కేవలం 150 కిలోమీటర్ల దూరంలోనే ఉంది..టిబెట్​ లోని లాసా ఎయిర్​ బేస్​ నుంచి భారత్ సరిహద్దులు​ 260 కిలోమీటర్ల దూరంలో ఉంది.. లాసాలో ఉన్న ఎయిర్​ బేస్​ విస్తరణ పనులను చైనా ప్రారంభించినట్లు శాటిలైట్​ ఫొటోల్లో స్పష్టం కన్పిస్తొంది..అక్కడ రెండో విమాన రన్​ వేను చైనా నిర్మిస్తున్నట్లు సమాచారం..బాంగ్డా,,లాసా,, షిగాత్సే వైమానిక స్థావరాలలో చైనా సిద్ధంగా ఉంచిన డ్రోన్ల జాబితాలో ‘WZ-7 సోరింగ్​ డ్రాగన్​’  అనే అత్యాధునిక డ్రోన్లు ఉన్నట్లు ఫోటోల్లో వెల్లడైంది..నిర్విరామంగా గగనతలంలో 10 గంటల పాటు పహారా కాస్తూ ఎగరగల సామర్థ్యం ‘WZ-7 సోరింగ్​ డ్రాగన్​’  కు ఉంది..ఈ డ్రోన్​ నిర్దేశిత ప్రదేశాల గగన తలంలో తిరుగుతూ అక్కడి మ్యాపింగ్​,, ఇమేజెస్​ ను సైనిక స్థావరానికి చేరవేస్తుంది..ఇది పంపించే మ్యాపింగ్​, ఇమేజెస్​ ఆధారంగా,, లక్ష్యం ఎంత దూరంలో ఉందనే దానిపై ఒక స్పష్టతతో సైన్యం క్షిపణులను ప్రయోగిస్తుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *