x
Close
DEVOTIONAL

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించిన సీ.ఎం జగన్

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించిన సీ.ఎం జగన్
  • PublishedSeptember 27, 2022

తిరుమలి: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన మంగ‌ళ‌వారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.ముందుగా సీ.ఎం బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి,ఈ.వో ఎవి.ధ‌ర్మారెడ్డి స్వాగతం పలికారు.ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.