AMARAVATHICRIME

డార్క్ నెట్ మాదక ద్రవ్యలను స్మగ్లింగ్-ఆరుగురు వ్యక్తులు అరెస్ట్-ఎన్.సి.బీ

అమరావతి: దేశవ్యాప్తంగా(ప్యాన్ ఇండియా) గుట్టు చప్పడు కాకుండా మాదక ద్రవ్యాల సరఫరా చేసే నెట్ వర్క్ ముఠాకు చెందిన 6 గురు వ్యక్తులను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అరెస్ట్ చేసింది..సింథటిక్ రసాయనాల ఆధారిత మాదక ద్రవ్యాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంది..ఈ కేసులో నిందితులు క్రిప్టోకరెన్సీతో డార్క్ వెబ్ ద్వారా లావాదేవీలు జరుపుతున్నారని గుర్తించింది..లైసెర్జిక్ యాసిడ్ డైథైలామైడ్ (LSD) 15,000 బ్లాట్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు NCB డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ వెల్లడించారు..ఒకే ఒక ఆపరేషన్ లో ఇంత భారీ స్థాయిలో LSD బ్లాట్స్ ను స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పారు.. నిందితులు డార్క్ నెట్ ద్వారా క్రిప్టో వాలెట్స్, క్రిప్టోకరెన్సీలను ఉపయోగించి లావాదేవీలు జరుపుతున్నారన్నారు.. ఇలాంటి లావాదేవీల్లో కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య భౌతిక సంబంధాలు ఉండవని చెప్పారు..
మాదకద్రవ్యాల నెట్ వర్క్ పోలాండ్,,నెదర్లాండ్స్,,యునైటెడ్ స్టేట్స్ తో పాటు మన దేశంలోని రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి ప్రాంతాలకు విస్తరించి ఉందని తెలిపారు..ఈ ఆపరేషన్ లో 2.5 కేజీల మారిజువానాను, రూ.24.65 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు..పట్టుబడిన LSD హయ్యర్ గ్రేడ్ మాదక ద్రవ్యం కాబట్టి దీని విలువ కూడా ఎక్కువేనని NCB అధికారులు తెలిపారు. పట్టుబడిన LSD వాసన, రుచి లేదని, ఈ ముఠా సభ్యులు మాదక ద్రవ్యని పుస్తకాల మధ్యలో వుంచి రవాణా చేయడం వల్ల గుర్తించడం చాలా కష్టమైందని చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *