ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు హైకోర్టు రూ.25వేలు జరిమానా
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలకు సంబంధించి డిగ్రీ,, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికెట్లను బయటకు చూపించాల్సిన అవసరం లేదని శుక్రవారం గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది.. ప్రధాని విద్యార్హతల వివరాలు అడుగుతూ కోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్ కు రూ.25 వేల జరిమానా విధించింది..ప్రధాన మంత్రి కార్యాలయం అలాంటి వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది..
ఆసహనం వ్యక్తం చేసిన కోర్టు:- ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతల వివరాలను చెప్పాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు..దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కేజ్రీవాల్ పై అసహనం వ్యక్తం చేస్తూ, ప్రధానమంత్రి కార్యాలయం ప్రధాని మోడీ విద్యార్హత వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది.. గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీల పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ద్వారా మోడీ విద్యార్హతల వివరాలు తెలపాలన్న కేజ్రీవాల్ పిటిషన్ను కొట్టి వేస్తూ ఈ తీర్పు ఇచ్చింది..ఈ జరిమానాను గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది.