CRIMENATIONAL

ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ కు తప్పని లైగింక వేధింపులు

అమరావతి: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై లైగింక వేధింపులు,,అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అనేందుకు డజన్ల కొద్ది ఉదాహరణలు..గురువారం ఓ కారు డ్రైవర్ (DCW) ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు..విషయంలో వెళ్తే…ఢిల్లీలోని ఎయిమ్స్ గేట్ 2 దగ్గర  వేకువ జామున 3 గంటల సమయంలో కారులో వచ్చిన ఓ వ్యక్తి స్వాతితో అసభ్యంగా ప్రవర్తించాడు..ఫుట్ పాత్ పై స్వాతి మలివాల్ తన టీమ్ తో కలిసి నిలబడ్డారు..ఇంతలో అక్కడికి కారులో వచ్చిన హరీశ్ చంద్ర, తన కారులో కూర్చోవాలని స్వాతి మలివాల్ ను పదే పదే పిలిచాడు..అతని ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ, స్వాతి కారు వద్దకు వెళ్లి డోర్ పై చెయ్యి వేసి ప్రశ్నంచబోయింది.. అతను వెంటనే ఆమె చెయ్యిపైనే విండో గ్లాస్ ను క్లోజ్ చేసి  ఆమెను 10 నుంచి 15 మీటర్ల దూరం కారుతో అలానే లాక్కుని వెళ్లి అ తరువాత వదిలేశాడు..కారు నంబర్ గుర్తు వుంచుకున్న స్వాతి మలివాల్, పోలీసులకు ఫిర్యాదు చేశారు..తక్షణమే స్పందించిన పోలీసులు కారు నెంబరు ఆధారంగా అతడిని 47 ఏళ్ల హరీశ్ చంద్ర గుర్తించి,,అతన్ని అరెస్ట్ చేసి 323, 341, 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు..సంఘటన జరిగిన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.

(డిసెంబర్ 31వ తేది రాత్రి స్కూటర్ పై వెళ్తున్న అంజలీ సింగ్ అనే మహిళను కొందరు యువకులు,కారుతో ఢీకొట్టి కిలోమీటర్ల దూరం ఆమెను కారుతో ఈడ్చుకెళ్లారు..ఈ ఘటనలో అంజలీ మరణించింది..దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటన మరువకముందే ఏకంగా మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ కు నేడు ఇలాంటి పరిస్థితే ఎదురుకావడం ఆందోళన కలిగిస్తోంది..)

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *