DISTRICTS

ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని అభివృద్ధి కృషి-మంత్రి కాకాణి

నెల్లూరు: తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఏర్పాటుకు కోటి రూపాయల విలువైన స్థలాన్ని ఉచితంగా అందజేయడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉదార స్వభావానికి నిదర్శనమని,ఇదే స్ఫూర్తితో భవన నిర్మాణానికి కృషి చేస్తామని  వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం వెంకటాచలం సమీపంలోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ అధ్యయన కేంద్రాన్ని దివంగత ముఖ్యమంత్రి  వైయస్ రాజశేఖర్ రెడ్డి సాధిస్తే, భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రత్యేక కృషితో వెంకటాచలంలో నెలకొల్పడం జరిగిందన్నారు..ఈ కేంద్రానికి సొంత స్థలంలో భవన నిర్మాణాల విషయమై భారత ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. సొంత భవనాలు కూడా నిర్మించి తెలుగు భాష ప్రాశస్త్యం, ప్రాభవం భవిష్యత్ తరాలకు తెలిసేలా ఈ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని, తద్వారా తెలుగు భాష పూర్వ వైభవానికి ఎల్లవేళలా కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *