x
Close
NATIONAL

75 సంవత్సరాల తరువాత గ్రామల్లో తొలిసారి విద్యుత్ వెలుగులు

75 సంవత్సరాల తరువాత గ్రామల్లో తొలిసారి విద్యుత్ వెలుగులు
  • PublishedJanuary 9, 2023

అమరావతి: స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల తరువాత జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని మారుమూల టెథాన్‌టాప్ గుర్జర్ టౌన్‌షిప్‌లో తొలిసారి విద్యుత్ వెలుగులు విరజిమ్మాయి..స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లోని గ్రామాలన్నీ అంధకారంలోనే వుండిపోయాయి..అధికారం చేపట్టిన రాజకీయ పార్టీలు ఈ ప్రాంతల వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు..ప్రధాని మంత్రి నరేంద్రమోదీ దేశంలోని మారుమూల గ్రామలకు విద్యుత్ సౌకర్యం కల్పించిలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన,, ప్రధానమంత్రి వికాస్ యోజన కింద ఈ గ్రామానికి అధికారులు విద్యుత్ అందించారు.. ప్రత్యేకంగా ట్రాన్స్ ఫార్మర్లు,, స్తంభాలు ఏర్పాటు చేసి అన్ని అడ్డంకులను అధిగమించి స్థానికులకు విద్యుత్ అందించారు..విద్యుత్ సరఫరాకు కృషిచేసిన అధికారులకు గ్రామస్తులు సన్మానం చేశారు..తమ జీవితంలో తొలిసారి ఇళ్లలో బల్బులు వెలుగడం,,పిల్లలు విద్యుత్ లైట్ల వెలుతురులో చదవడం, రాయడం చూస్తూ సంతోషం వ్యక్తం చేశారు..గతంలో గ్రామస్తులు మొబైల్ ఫోన్ల చార్జింగ్ కోసం వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చేది..ఇప్పుడు ఇంటిలోనే చార్జింగ్ పెట్టుకొనే సదుపాయం రావటంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *