AMARAVATHITECHNOLOGY

దేశంలో మొదటి అండర్ వాటర్ మెట్రో రైలు ట్రయల్స్

అమరావతి: కోల్ కతాలో అండర్ వాటర్ మెట్రో రైలు సంబంధించిన ట్రయల్స్ నడుస్తున్నాయి..హుగ్లీ నదిలో నిర్మించిన సొరంగ మార్గంలో ఏప్రిల్ బుధవారం(12వ తేదీన) మహాకరణ్​ స్టేషన్​ నుంచి హావ్​డా మైదాన్​ మెట్రో స్టేషన్​ వరకు మెట్రో రైలు ట్రయల్స్ నిర్వహించారు..ఈ ట్రైన్‌లో కోల్​కతా మెట్రో జనరల్ మేనేజర్ ఉదయ్​ కుమార్ రెడ్డితో పాటు ఇంజినీర్లు, అధికారులు  ప్రయాణించారు..భారత్‌లో నీటి లోపల మెట్రో రైలు వెళ్లడం ఇదే తొలిసారి..మరో 7 నెలల పాటు హౌరా మైదాన్ నుంచి ఎస్​ప్లెనేడ్ వరకు ట్రయల్ రన్ కొనసాగనుంది..ఆటు తరువాత ప్రజలకు కోసం రెగ్యులర్ సర్వీసులు నడుస్తాయి..ఈ మార్గం  కోల్‌కతాలోని ఐటీ హబ్ సాల్ట్ లేక్‌లోని హౌరా మైదాన్, సెక్టార్ Vని కలుపుతోంది..మొత్తం 4.8 కిలోమీటర్ల పొడవులో సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు.. హుగ్లీ నదీ అంతర్భాగంలో 32 మీటర్ల లోతులో 520 మీటర్ల సొరంగాన్ని నిర్మించారు..ఈ మెట్రో రైళ్లో ఎస్​ప్లెనేడ్, హావ్​డా మైదాన్ మధ్య దూరాన్ని కేవలం 45 సెకన్లలో చేరుకుంటుంది.. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *