నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో జనాభా నిష్పత్తికి తగ్గట్టుగా యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని, ఎన్నికల సంఘం నిర్దేశాలను పటిష్టంగా పాటించాలని ఎన్నికల అధికారులకు కమిషనర్ వికాస్ మర్మత్ ఆదేశించారు. ఎన్నికల అధికారులు, సూపర్ వైజర్లు, బూత్ లెవెల్ అధికారులతో స్థానిక కస్తూర్భా కళాక్షేత్రంలో సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని, క్షేత్ర స్థాయిలో ఓటర్ల జాబితా రూపొందించడంలో బి.ఎల్.ఓ లు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రము పరిధిలో బౌండరీస్ ను కచ్చితంగా నిర్ణయించుకొని, జనాభా నిష్పత్తి, లింగ నిష్పత్తి, కొత్త ఓటర్ల నమోదు, వివిధ క్లయిములను పారదర్శకంగా పరిగణించాలని ఆదేశించారు.
ఓటరును పోలింగ్ కేంద్రం బదిలీ చేసే సందర్భంలో కుటుంబ సభ్యుల వారీగా ఉన్న ఓట్లను విడదీయవద్దని, జనాభాకు తగ్గట్టుగా ఓటర్ల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలలో నిష్పత్తిని సమం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. మునిసిపాల్ కార్యాలయానికి పంపించే తొలగింపు ఫారం 7ను సరియైన రిమార్క్స్ తో పాటు తప్పనిసరిగా సాక్షి సంతకాన్ని కూడా సేకరించాలి అని సూచించారు. మాన్యువల్ గా సమర్పించే క్లయిములకు తగిన రసీదులను తప్పనిసరిగా క్లెయిమ్ దారుడు/దారిణి లకు అందించాలని,,ఓటర్ల చేర్పులు, తొలగింపులకు రాజకీయ పార్టీల బి.ఎల్.ఏ లను సమన్వయం చేసుకుని జాబితాలో ఎలాంటి తప్పిదాలు లేకుండా సరిచూసుకోవాలని కమిషనర్ సూచించారు. నగర పాలక సంస్థ పరిధిలోని 6, 7, 8 క్లైయిమ్ ఫారాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సూచించిన గడువులోగా పరిష్కరించాలని కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో ఏ.ఈ.ఆర్.ఓలు నిర్మలానంద బాబా, దేవీ కుమారి, దశయ్య, ధనుంజయులు, ఈ.డి.టి మాధవి, చక్రపాణి, సూపర్ వైజర్లు, బూత్ లెవెల్ అధికారులు, ఎలక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.