జైలు నుంచి విడుదల అయిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ
అమరావతి: మాజీ క్రికెటర్,,పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ(59),, జైలులో సత్ప్రవర్తన కారణంగా రెండు నెలల ముందుగానే శనివారం విడుదల అయ్యారు..పంజాబ్ జైలు నిబంధనల ప్రకారం సత్ప్రవర్తన కలిగిన దోషి క్షమాపణకు అర్హులని సిద్ధూ తరఫు లాయర్ హెచ్పీఎస్ తెలిపారు..నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ క్యాన్సర్ వ్యాధి (స్టేజీ 2తో) బాధపడుతున్నారు..
1988 డిసెంబరు 27న పాటియాలో పార్కింగ్ విషయంలో 65ఏళ్ల గుర్నామ్ సింగ్కు సిద్ధూ, తన స్నేహితుడు రూపిందర్ సింగ్లకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.. ఈ సంఘటనలో గుర్నామ్ సింగ్ మృతి చెందాడు..ఈ కేసులో సుప్రీంకోర్టు సిద్ధూను దోషిగా నిర్ధారించింది.. మే 2022 నుంచి ఆయన పాటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తూ వచ్చారు..