NATIONAL

గుజరాత్‌ ఉమ్మడి పౌరస్మృతి అమలుకు కమిటీ ఏర్పాటు-హర్ష్ సంఘ్వి

అమరావతి: గుజరాత్‌ లోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు సంబంధించి కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం శనివారం ఆమోదం తెలిపినట్టు రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘ్వి తెలిపారు.గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు కానున్న కమిటీలో 3 నుంచి 4 సభ్యులు ఉంటారని కేంద్ర మంత్రి పర్సోత్తమ్ రూపాల వెల్లడించారు. ప్రధాన నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నాయకత్వంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పాటేల్ శనివారం జరిపిన మంత్రివర్గ సమావేశంలో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్టు సంఘ్వి పేర్కొన్నారు. ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయాల్సిన పరిస్థితులను కమిటీ పరిశీలించి, ఇందుకు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేస్తుందని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా  ట్వీట్‌లో పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *