NATIONAL

ప్రభుత్వం ఉద్యోగాలు చేస్తు,ఉగ్రవాదంను ప్రొత్సహిస్తున్ననలుగురు ఉద్యోగులు టెర్మినేట్

అమరావతి: జమ్ము కశ్మీర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తు,,ఉగ్రవాదంను ప్రొత్సహిస్తున్న నలుగురు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యొగం నుంచి శాశ్వతంగా తొలిగించింది.. ఉద్యోగం కోల్పోయిన వారిలో ఉగ్రవాదల కుటుంబ సభ్యులు ఉన్నారు..హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ కొడుకు సయ్యద్ అబ్దుల్ ముయీద్, జేకేఎల్ఎఫ్ ఉగ్రవాది ఫరూక్ అహ్మద్ అలియాస్ బిట్టా కరాటే భార్య అస్సబా ఉల్ అర్జామండ్ ఖాన్ ఉన్నారు..డాక్టర్ ముహీత్ అహ్మద్ భట్ (డి కేటగిరీ సైంటిస్ట్-కశ్మీర్ యూనివర్సిటీ), మజీద్ హుస్సేన్ ఖాద్రీ (సీనియర్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్-కశ్మీర్ యూనివర్సిటీ), సయ్యద్ అబ్దుల్ ముయీద్ (ఐటీ మేనేజర్-జేకేఈడీఐ), అస్సబా ఉల్ అర్జామండ్ ఖాన్ (పబ్లిసిటీ విభాగం-డైరెక్టరేట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్)లు ఉన్నారు..వీరంతా చాప క్రింద నీరులాగా,,ఉద్యోగంలో వుంటూ ఉగ్రవాద చర్యలకు ఆర్దిక తొడ్పటు అందించడం లాంటి చర్యలు పాల్పపడుతున్నట్లు నిఘ వర్గాలు ఆధారలు సేకరించాయి..వీరి కార్యకలాపాలు రాష్ట్ర భద్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని నిఘా సంస్థలు, లా ఎన్ ఫోర్స్ మెంట్ అందించిన సమాచారం మేరకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *