x
Close
HEALTH NATIONAL

ఉచితంగా కరోనా బూస్టర్ డోస్-మంత్రి అనురాగ్ ఠాకూర్

ఉచితంగా కరోనా బూస్టర్ డోస్-మంత్రి అనురాగ్ ఠాకూర్
  • PublishedJuly 13, 2022

అమరావతి: కేంద్ర ప్రభుత్వం కరోనా బూస్టర్ డోస్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది..18 నుంచి 59 సంవత్సరాలు మధ్య వయస్సు వున్న వారందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ అందించాలని,,ఈ ప్రక్రియ జులై 15వ తేది నుంచి 75 రోజుల పాటు బూస్టర్ డోస్ డ్రైవ్ కొనసాగుతుందని కేంద్ర సమాచార,ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం మీడియాకు తెలిపారు..దేశంలో వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు..రెండు డోసులు కేంద్రమే ఉచితంగా అందించగా కొంత మంది డబ్బు చెల్లించి మూడో డోస్‌ను వేయించుకున్నారు..దేశంలో ఇప్పటి వరకు 199.12 కోట్లకు పైగా  డోసుల కరోనా వ్యాక్సిన్ అందజేశారు..ప్రతి రోజు 11 లక్షల మందికి టీకాలు వేస్తున్నారు.. మూడవ డోసు ఫ్రీగా వేయనుండడంతో,,వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది..

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.