EDUCATION JOBS

10వ తరగతి పరీక్షల్లో ఇక నుంచి 6 పేపర్లే

అమరావతి: రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా విధానంలో ప్రభుత్వం కీల‌క మార్పులు చేసింది. టెన్త్ క్లాసుకు సంబంధించి ఇకపై 6 పరీక్షలే నిర్వహించాలని నిర్ణయించింది..2022-23 అకడమిక్ ఇయర్ నుంచి ఈ విధానం అమలు చేయాలని గతంలో ఇచ్చిన జీవో MS NO 82ను సవరిస్తూ ఉత్తర్వులు విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ జారీ చేశారు..గ‌తంలో 11 పేప‌ర్లు ఉండగా, కోవిడ్ కారణంగా మధ్యలో 7 పేపర్లకు ప్రభుత్వం కుదించింది.ప్రస్తుతం CBSC సిలబస్ దృష్ట్యా 6 పేప‌ర్లతో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.. ఫిజిక్స్,బ‌య‌లాజిక‌ల్ సైన్స్‌ కు ఒకే ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు తెలిపింది.  స్టూడెంట్స్‌పై ఒత్తిడి తగ్గించేందుకే కొత్త విధానం తెచ్చామని,,సంవత్సర అంతా పరీక్షలు జరపడం వల్ల 11 పేపర్లు అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిన్నట్లు సమాచారం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *