HYDERABAD

రాయదుర్గం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు, మెట్రో కేవలం 26 నిమిషాల్లో

మెట్రో రెండోదశ నిర్మాణం..

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రెండోదశ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శుక్రవారం శకుస్థాపన చేశారు. నాగోల్‌-రాయదుర్గం కారిడార్‌-3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ మెట్రోకు గచ్చిబౌలి సమీపంలోని ఐకియా షోరూమ్ ఎదురుగా ఉన్న మైండ్‌స్పేస్‌ వద్ద పునాదిరాయి వేశారు. మెట్రో రెండోదశ విస్తరణలో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు (31 కి.మీ.) వరకు కేవలం 26 నిమిషాల్లో ప్రయాణించేలా హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఏర్పాట్లు చేస్తున్నది. విమానాశ్రయానికి త్వరగా చేరేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది. పిల్లర్లతోపాటు 2.5 కిలోమీటర్ల మేర భూగర్భంలో రైలు మార్గాన్ని నిర్మించనున్నది. అవుటర్‌ రింగ్‌రోడ్డు వెంట నిర్మించే ఈ మార్గంలో 120 కి.మీ వేగంతో ప్రయాణించేలా ఎయిరో డైనమిక్‌ టెక్నాలజీని వినియోగించనున్నారు.రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు 8-9 స్టేషన్లు ఉండనున్నాయని, కార్గో లైన్‌, ప్యాసింజర్‌ లైన్‌ వేర్వేరుగా ఉంటాయని మెట్రో రైల్‌ MD NVSరెడ్డి తెలిపారు.3సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *