బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..పాదయాత్ర నిలిపివేయాలంటూ వరంగల్ పోలీసులు ఇచ్చిన నోటీసులను రద్దు చేసింది..బుధవారం బీజేపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్ పై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జనగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న బండి సంజయ్,,మంగళవారం ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించిన ఘటనలో బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ దీక్షకు దిగారు..సంజయ్ దీక్షను భగ్నం చేసిన పోలీసులు,,బండి సంజయ్ ను వెంటనే పాదయాత్రను నిలిపివేయాలంటూ నోటీసులు ఇచ్చారు.ప్రస్తుత పరిస్థితుల్లో బండి పాదయాత్ర చేపడితే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు పోలీసు నోటీసులను సవాల్ చేస్తూ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు..