AMARAVATHIDISTRICTS

పవన్ ను సీ.ఎంగా ఏపార్టీ ప్రకటిస్తే,అ పార్టీకే మద్దుతు-గాదె.బాలాజీ

అమరావతి: పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా ఏ పార్టీ ప్రకటిస్తే ఆ పార్టీకే మద్దతు చేస్తామని రాధా రంగా రాయల్ ఆర్గనైజేషన్ అధ్యక్షడు గాదె.బాలాజీ స్పష్టం చేశారు.మంగళవారం విశాఖపట్నంలో ఈ నెల 26వ తేదిన వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలో జరగబోయే కాపునాడు మహాసభ పోస్టర్‌ను మాజీ మంత్రి గంటా.శ్రీనివాసరావు ఆవిష్కరించారు. టీడీపీ అయినా మరే ఇతర పార్టీ అయినా సరే మాకు సంబంధం లేదనీ,,ఆ మాటకొస్తే పవన్ కల్యాణ్ అభిప్రాయం కూడా తాము తెలుసుకోదలుచుకోలేదని బాలాజీ అన్నారు. కాపుల్లో ఐక్యత లేదన్నది పాత మాట… కాపులంతా ఒక్కటే…ఇదే కొత్త తరం బాట….ఒకప్పుడు రంగా బొమ్ము పెట్టుకుని ముందుకెళ్లేందుకు కూడా భయపడేవారనీ…ప్రస్తుతం ఆ మాటకు ఆవకాశం లేదన్నారు. కాపుల్లో ఐక్యత సాధించడమే లక్ష్యంగా, కాపులు రాజ్యాధికారం సాధించడమే ధ్యేయంగా.. రాధా-రంగ ఆర్గనైజేషన్ పని చేస్తుందన్నారు.తాము నిర్వహించనున్న సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాపు ప్రతినిథులు వస్తారని తెలిపారు.రెండు ప్రాంతాల్లో ఉన్న కాపు నాయకులందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పారు.ఇక రాబోయే రోజుల్లో తాము ఇంక కింగ్ మేకర్ పొజిషన్లో ఉండ దలుచుకోవడం లేదనీ, ఇకపై కాపులు కింగ్ పాత్ర పోషించాలనుకుంటున్నామనీ గాదె.బాలాజీ అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *