x
Close
NATIONAL

ఏడు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసిన భారత్-బంగ్లా

ఏడు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసిన భారత్-బంగ్లా
  • PublishedSeptember 6, 2022

స్నేహంతో ఎలాంటి సమస్యనైనా..

అమరావతి: ఆర్దిక ఆసమానతలు,,పేదరిక నిర్మూలన,,ఆర్థికవ్యవస్థ అభివృద్ధిపై భారత్-బంగ్లాదేశ్ లు కలిసి పనిచేస్తాయని బంగ్లా ప్రధాని షేక్ హసీనా అన్నారు..స్నేహంతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని,,భారత్ తో తమ స్నేహం అలాంటిదేన్నారు..భారత్ పర్యటనలో భాగంగా మంగళవారం ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు..రక్షణ,,వాణిజ్య రంగాలతో పాటు నదీ జలాల పంపిణీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు..
ప్రధాని నరేంద్ర మోడీ:- భారత్-బంగ్లా సంబంధాలు రానున్న రోజుల్లో కొత్త శిఖరాలకు చేరుతాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు..భారత్ బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం వేగంగా పెరుగుతుందని,,ఐటీ, అంతరిక్షం, అణు రంగాల్లో సహకారం అందించాలని నిర్ణయించామన్నారు..విద్యుత్ ప్రసార మార్గాలపై భారత్, బంగ్లాదేశ్ లో కూడా చర్చలు జరుగుతున్నాయన్నారు..54 నదులు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి ప్రవహిస్తాయన్నారు..కుషియారా నది నీటిభాగస్వామ్యానికి ముఖ్య ఒప్పందం చేసుకున్నామన్నారు..భారత్, బంగ్లాదేశ్ మధ్య ఏడు అవగాహన ఒప్పందాలు జరిగాయి..

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.