x
Close
NATIONAL OTEHRS

232 చైనా యాప్‌లపై నిషేధం విధించిన భారత ప్రభుత్వం

232 చైనా యాప్‌లపై నిషేధం విధించిన భారత ప్రభుత్వం
  • PublishedFebruary 5, 2023

అమరావతి: కంత్రీ చైనా దేశంకు సంబంధించి,భారతదేశంలో కార్యకలపాలు సాగిస్తూన్న 232 యాప్‌లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్‌ చేస్తూ ఆదివారం నిర్ణయం తీసుకుంది..గతంలో కూడా చాలా చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం విధించిన విషయం పాఠకులకు విదితమే..ప్రస్తుతం 138 బెట్టింగ్‌ యాప్‌లు,, 94 లోన్‌ యాప్‌లపై,,కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఐటీ శాఖ నిషేధం విధించింది..ఆరునెలల క్రితమే చైనా యాప్‌లపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సిఫారసు చేసింది..చైనా యాప్స్,,లోన్ల పేరుతో వేధింపులకు గురిచేస్తునట్టు కేంద్ర హోంమంత్రిత్వశాఖ దర్యాప్తులో తేలింది..అలాగే ఈ యాప్ ల  నిర్వహకులు గూఢచర్యానికి పాల్పపడుతున్నట్లు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించింది.. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అత్యవసర ప్రాతిపదికన నిషేధించడానికి, బ్లాక్ చేయడానికి ప్రక్రియను ప్రారంభించిందని అధికార వర్గాలు తెలిపాయి.. లోన్ లెండింగ్ యాప్ లలో 94 యాప్‌లు ఇ-స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయని,, మరికొన్ని థర్డ్-పార్టీ లింక్‌ల ద్వారా పనిచేస్తున్నాయని కనుగొంది..ఈ యాప్‌లు భారతీయ పౌరుల డేటాకు భద్రతా ప్రమాదాన్ని కలిగించవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.