గల్వాన్ లోయ ప్రాంతంలో మంచుపై క్రికెట్ అడుతున్న భారత సైనికులు
అమరావతి: చైనా సరిహద్దు ప్రాంతంలో భారత ఆర్మీ తన కార్యకలాపాలను పెంచింది..లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ(LAC) చుట్టూ ప్రాంతాల్లో గుర్రాలు,,గాడిదలతో ఆర్మీ సిబ్బంది సంచరిస్తున్న వీడియోలతో పాటు, పాంగోంగ్ సరస్సుపై భద్రత చర్యల్లో పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..గల్వాన్ లోయ ప్రాంతంలో భారత్,, చైనా సరిహద్దులోని పెట్రోలింగ్ పాయింట్ (PC) 14 వద్ద 2020లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ తలెత్తింది.. ప్రస్తుతం అదే ప్రాంతంలో భారత ఆర్మీ భద్రత స్థాయిన పెంచింది..ఈ ప్రాంతంలో పటియాలా బ్రిగేడ్ కు చెందిన త్రిశూల్ డివిజన్లో సైనికులు PC-14 కు కేవలం 4 కిలో మీటర్ల దూరంలో సరదాగా క్రికెట్ ఆడుతూ కనిపించారు.. ఇందుకు సంబంధించిన ఫొటోలను భారత ఆర్మీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది..గడ్డకట్టే చలిలో సైతం జవాన్లు ఉత్సాహంగా క్రికెట్ ఆడుకుంటున్నారు..మేం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం అంటూ ఇండియన్ ఆర్మీకి చెందిన లేహ్ బేస్ట్ 14 సైనిక బృందం ట్విటర్ లో పోస్టు చేసింది..గల్వాన్ ఘటన తర్వాత భారత్ – చైనాల మధ్య ప్రతిష్టంభన నెలకొనడంతో ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారులు చర్చలు జరిపి పెట్రోలింగ్ పాయింట్ 14కు 1.5 కిలో మీటర్ల దూరం నుంచి బఫర్ జోన్ గా ప్రకటించారు.
#WATCH गलवान घाटी के पास तैनात भारतीय सेना के फॉर्मेशन ने हाल के महीनों में घोड़ों और खच्चरों पर वास्तविक नियंत्रण रेखा(LAC) के पास के क्षेत्रों का सर्वेक्षण और पैंगोंग झील पर हाफ मैराथन जैसी गतिविधियाँ की। pic.twitter.com/OUxPenfETc
— ANI_HindiNews (@AHindinews) March 4, 2023