x
Close
NATIONAL

భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి మృతి-దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి మృతి-దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
  • PublishedNovember 5, 2022

అమరావతి: భారతదేశానికి స్వతంత్ర సిద్దించిన నాటి నుంచి ఓటు హక్కును వినియోగించుకుంటున్న భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి (106) మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్యామ్ కుటుంబీలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. శ్యామ్ శరణ్ నేగి తుది శ్వాస విడిచే వరకూ బాధ్యతాయుత పౌరుడిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చారన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో నవంబర్ 2వ తేదిన పోస్టల్ బ్యాలెట్ ద్వారా శ్యామ్ ఓటు వేసిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. దీనిపై దేశంలోని ప్రతి పౌరుడు ఆలోచించుకోవాలని, శ్యామ్ శరణ్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. శ్యామ్ నేగి, హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ లో 1917 జులై 1న జన్మించారు. 1951 సాధారణ ఎన్నికల్లో ఆయన ఓటు వేశారు. అప్పటినుంచి ప్రతిసారి తన ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు. 2014లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం యువ ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన కల్పించే కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా శ్యామ్ శరణ్ నేగిని నియమించింది.  

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.