కార్లల్లో 6 ఎయిర్బ్యాగులు ఉండాలన్న నిబంధన ఆమలు?-నితిన్ గఢర్కీ

అమరావతి: కొత్తగా తయారు అయ్యే కార్లలో 6 ఎయిర్బ్యాగులు ఉండాలన్న నిబంధన వచ్చే సంవత్సరం అక్టోబర్ 1, 2023 నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కంపెనీలు తప్పనిసరిగా ఈ నిబంధన పాటించాలని ఆయన ట్వీట్టర్ లో పోస్టు చేశారు. అక్టోబర్ నుంచే ఈ రూల్ను అమలు చేయాలని కేంద్రం అనుకున్నప్పటికీ ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని వాయిదా వేసినట్లు గడ్కరీ తెలిపారు. ధర, వేరియంట్లతో సంబంధం లేకుండా దీనిని అమలుచేయాలన్న గడ్కరీ.. మోటారు వాహనాల్లో ప్రయాణించే వారి భద్రతే తమకు ప్రాధాన్యమని తెలిపారు.అక్టోబర్ 1,2022 నుంచి అన్ని కార్లలో ఆరు ఎయిర్బ్యాగులు ఏర్పాటు చేయాలని ఈ ఏడాది జనవరిలో కేంద్రం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
Considering the global supply chain constraints being faced by the auto industry and its impact on the macroeconomic scenario, it has been decided to implement the proposal mandating a minimum of 6 Airbags in Passenger Cars (M-1 Category) w.e.f 01st October 2023.
— Nitin Gadkari (@nitin_gadkari) September 29, 2022