AMARAVATHIBUSINESSCRIMEDISTRICTSHEALTHHYDERABADNATIONAL

Dolo-650 మాత్ర తయారీ సంస్థపై కార్యాలయల్లో ఐటీశాఖ సోదాలు

అమరావతి: కరోనా సమయంలోను,,అంతకు మునుపు ప్రతి ఒక్కరికి చితపరిచితమైన మాత్ర Dole-650..ఈ మాత్ర తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్‌ లిమిటెడ్‌పై Income tax విభాగం దాడులు చేసింది..బెంగళూరులోని రేస్‌ కోర్స్‌ రోడ్డులోని సదరు సంస్థ కార్యాలయంలో 20 మంది అధికారులు సోదాలు నిర్వహించారు..2020లో కరోనా వైరస్ ఉధృతంగా వున్న సమయంలో ఈ కంపెనీ రికార్డుస్థాయిలో 350 కోట్ల టాబ్లెట్లను విక్రయించింది..ఇదే సమయంలో ఒకే సంవత్సరంలో దాదాపు రూ.400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి అనేక కంపెనీలను అధిగమించింది..ఇలా సంపాదించిన ఆదాయంపై పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో జరిపిన ఈ దాడుల్లో కార్యాలయంలో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.. దిల్లీ, సిక్కిం, పంజాబ్‌, తమిళనాడు, గోవాలతో పాటు దేశవ్యాప్తంగా 40 ప్రాంతల్లో,,200 మందికి పైగా అధికారులు ఏకకాలంలో సోదాల్లో పాల్గొన్నట్టు ఐటీశాఖ వర్గాలు పేర్కొన్నాయి..మైక్రో ల్యాబ్స్‌ సీఎండీ దిలీప్‌ సురానా, డైరెక్టర్‌ ఆనంద్‌ సురానా నివాసాల్లోనూ సోదాలు నిర్వహించినట్టు సమాచారం..ఈ సోదాల్లో భాగంగా బెంగుళూరులోని మాధవ నగర్‌లోని రేస్‌కోర్సు రోడ్డులోని మైక్రో ల్యాబ్స్‌ లిమిటెడ్‌ కార్యాలయంలో పలు కీలక పత్రాలు సేకరించినట్టు తెలుస్తోంది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *