AMARAVATHINATIONAL

ప్రమాదం జరగడం దురదృష్టకరం-రైలు ప్రమాదానికి కారకులపై కఠిన చర్యలు-ప్రధాని మోదీ

అమరావతి: ఒడిశాలోని బాలాసోర్ లో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాద సంఘటన స్థలానికి శనివారం మధ్యహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకుని పరిశీలించారు..ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూన్న క్షతగాత్రులను పరామర్శించారు.అనంతరం ప్రధాని మీడియాతో మాట్లాడుతూ రైలు ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు..ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించామని,, ప్రమాదానికి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.. రైలు ప్రమాదం చాలా దురదృష్టకరమని,,ఈ ఘటనలో చాలా రాష్ట్రాల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చెప్పారు..మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు..సహాయక చర్యల్లో ఒడిశా ప్రభుత్వం అన్ని విధాల సహకరించిందని ప్రధాని తెలిపారు..క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ప్రధాని మోడీ అదేశించారు..ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి రక్తదానం చేసిన స్థానికులకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు..ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్రం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది..మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు,,తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయాలపాలైనవారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం ప్రకటించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *