NATIONALPOLITICS

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన జగదీప్‌ ధన్‌ఖడ్‌

అమరావతి: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగదీప్‌ ధన్‌ఖడ్‌ సోమవారం ఉదయం నామినేషన్‌ దాఖలు చేశారు..రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న లోక్ సభ సెక్రెటరీ జనరల్ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్​కు ఆయన నామినేషన్ పత్రాలు అందచేశారు..ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్​ షా, రాజ్​నాథ్​సింగ్, నితిన్ గడ్కరీ, రామ్​దాస్ అథవాలే పాల్గొన్నారు..ఈ సందర్బంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్‌ ధన్‌ఖడ్‌ మాట్లాడుతూ దేశ ప్రజాస్వామ్య విలువలను పెంపొందించేందుకు నేను సర్వధ కృషి చేస్తానని పేర్కొన్నారు..తన లాంటి సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఈ అవకాశం వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదని,,నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియచేశారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *