ఝార్ఖండ్ సీ.ఎం హేమంత్ సోరెన్ ఎమ్మేల్యే సభ్యత్వం రద్దు చేసిన గవర్నర్
అమరావతి: జెఎంఎం నేతృత్వంలోని ఝార్ఖండ్ పాలనకు ఎదురుదెబ్బ తగిలింది. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేస్తున్నట్లుగా ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో,,ఈసీ సిఫారసుల మేరకు సోరెన్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని గవర్నర్ రమేశ్ బైస్ రద్దు చేశారు..తనకు తానే మైనింగ్ కేటాయించుకున్నారని సోరెన్ పై ఆరోపణలు వచ్చాయి..ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం (EC) సిఫార్సు చేసింది..రాష్ట్ర మైనింగ్ శాఖకు కూడా ముఖ్యమంత్రి చేతిలో వుండడంతో,,గత సంవత్సరం తనకు రాయి మైనింగ్ లీజును కేటాయించడానికి తన పదవిని దుర్వినియోగం చేసినందుకు సోరెన్ దోషిగా తేలిందని వర్గాలు తెలిపాయి..ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ హేమంత్ సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని,,అక్రమ మైనింగ్తో కోట్ల రూపాయలు లూటీ చేశారని ఆరోపించింది..శాసనసభ సభ్యత్వం రద్దయినా.. సోరెన్ సీఎంగా కొనసాగవచ్చు. యూపీఏ మిత్రపక్షాలు ఆయనకు మద్దతు తెలిపితే సరిపోతుంది. అయితే మరో ఆరు నెలల్లోగా ఆయన శాసనసభకు తిరిగి ఎన్నిక కావాల్సి ఉంటుంది.